‘‘రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ ( NTR ).ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించుకున్న ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నాడు.NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.

ఈ సినిమా (NTR31) తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) దర్శకత్వంలో ప్రకటించాడు.ఇండియా – పాకిస్థాన్ బోర్డు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ అడ్వెంచర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ సైతం వచ్చింది.ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను నీల్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

కాగా తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) హీరోయిన్ గా నటించనుంది అని తాజాగా బజ్ వినిపిస్తుంది.ఇది వరకు దీపికా పదుకొనె (Deepika Padukone) పేరు వినిపించగా ఇప్పుడు ఈమె ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయిఅయితే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరగలేదు.
కానీ ఇందులో హీరోయిన్ పాత్ర కీలకం అని అందులో స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్.ఇందులో ఎంత నిజమో ముందు ముందు తెలియాల్సి ఉంది.







