కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాలను పేర్కొంది.మాజీ మంత్రి వివేకా హత్య కేసును రెండు నేరాలుగా పరిగణించింది.
ఇందులో ఒకటి హత్య కాగా, మరొకటి ఆధారాలు చెరిపివేయడమని పేర్కొంది.ఈ క్రమంలో అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపింది.
అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వాస్తవాలు చెప్పడం లేదంది.దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాశ్ రెడ్డి సమాధానాలు ఇచ్చారని వెల్లడించింది.
దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నారని తెలిపింది.కాగా హత్య కేసులో ఆధారాలు చేరిపేసిన నేరంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ తోపాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు చేర్చారు.







