బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకుర్( Mrinal Thakur ) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇక 2014లో విట్టి దండు( vittti dandu ) అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది.ఆ తర్వాత బాలీవుడ్( Bollywood ) వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.
ఇక తెలుగులో గత ఏడాది సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.
అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది.చాలా వరకు ఈ ముద్దుగుమ్మ హిందీ వెండి తెరపై నటించగా అక్కడనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇక హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేస్తుంది.ఎందుకంటే సీతారామం సినిమాలో అంత పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా బోల్డ్ గా రెడీ అవ్వడంతో తట్టుకోలేకపోతున్నారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త లగ్జరీ కారు కొన్నట్లు తెలిసింది.ఇక ఆ కారు మోడల్ వచ్చేసి.మెర్సిడెస్ – బెంజ్ – ఎస్ క్లాస్ సెడాన్ ( Mercedes – Benz – S Class Sedan ) అనే లగ్జరీ కారు.
ఇక ఈ కారు పెద్దపెద్ద వ్యాపారవేత్తలు కొనుగోలు చేస్తారని తెలిసింది.ఇక ఈ కారు యొక్క స్పెషాలిటీ ఏంటంటే.ఇందులో మొత్తం 3 వేరియంట్లు ఉంటాయట.350డి, 400డి, 450డి ఉన్నాయని తెలిసింది.ఇక అందులో మృణాల్ తీసుకుంది ఎస్ 450డి.
ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉండగా ఈ మోడల్ ప్రారంభం ధర.రూ.1.71 కోట్ల నుండి రూ.2.17కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.మొత్తానికి విలువైన కారు కొనేసింది మృణాల్.