పంజాబ్ లోని లూథియానాలో విషాదం నెలకొంది.మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైన ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా.
మరో పది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.గియాస్ పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే పరిశ్రమ కూలింగ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ప్లాంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.







