వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దళితసంఘాల నేతలతో సమావేశం అయిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే దళిత సంక్షేమంపై మేనిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపై చర్చించారు.ఎస్సీలకు టీడీపీ చేసినన్నీ మంచి పనులు ఇంకెవరూ చేయలేదని చంద్రబాబు తెలిపారు.
ఎస్సీ సంక్షేమం కోసం చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలం అయ్యామన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఎస్సీల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకాన్ని అయినా జగన్ తెచ్చారా అని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో ఎస్సీల కోసం 28 ప్రత్యేక పథకాలు తెచ్చామని చెప్పారు.
కానీ తమ పథకాలను జగన్ ఎత్తేశారని ఆరోపించారు.







