ఏపీ సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా నార్పలలో సీఎం జగనన్న వసతి దీవెనను ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో పథకం ద్వారా 9,55,662 మంది విద్యార్థులకు రూ.912.71 కోట్ల లబ్ధి చేకూరనుంది.మరోవైపు సీఎం జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.







