టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్,ఉపాసన( Upasana ) గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్దిరోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.
తరచూ ఏదో ఒక విషయంతో ఉపాసన,రామ్ చరణ్ ల పేర్లు సోషల్ మీడియా( Social media )లో వినిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కలిసి వెకేషన్ లకు ఈవెంట్లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.త్వరలోనే రామ్ చరణ్ ఉపాసన( Ram charan ) తల్లిదండ్రులు కాబోతున్నారు.

రామ్ చరణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా తన భార్య ఉపాసనతో కలిసి స్పెండ్ చేయడంతో పాటు, వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఉపాసన రామ్ చరణ్ ఎక్కువగా లగ్జరీ ఫ్యాషన్స్ స్టైల్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు.వేసుకునే బట్టలు ధరించే వాచ్ లు చెప్పులు ఇలా ప్రతి ఒక్క విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు రామ్ చరణ్,ఉపాసన.ఇలా ఉంటే తాజాగా సన్నిహితులు ఫ్రెండ్స్ సమక్షంలో ఉపాసనకు ఘనంగా శ్రీమంతం చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ లో భాగంగా ఉపాసన రోజ్ కలర్ రంగు డ్రెస్ ను ధరించింది.

ఆ గులాబీ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పింక్ కలర్ గౌన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఉపాసన ధరించిన ఆ డ్రెస్ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉపాసన ధరించిన ఆ పింక్ కలర్ గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కు చెందినది.

దాని ధర 1102 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.90,471.చాలామంది ఆ ధర తెలిసి షాక్ అవుతున్నారు.
మొన్నటికి మొన్న ఉపాసనకు రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకని నిర్వహించగా అందులో జపనీస్ బ్రాండ్ కి చెందిన ఇస్సి మియాకే నుండి బ్లూ కలర్ ప్లిటడ్ ట్యూనిక్ డ్రెస్ ను ధరించింది.బ్లూ కలర్ డ్రెస్ ధర 430 డాలర్లు అనగా రూ.32,352 గా ఉంది.







