ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరుగుతూ పోతోంది.అయితే కొంతమంది విద్యార్థులు యూట్యూబ్ ను ఫాలో అవుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.
స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ప్రాక్టికల్ సబ్జెక్ట్ ( Practical subject )పై అవగాహన పెంచుకోవడం అనేది కొత్త కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది.ఇంటర్నెట్ వాడకం పెరిగిన క్రమంలో ఏ విషయం అయినా సులభంగా తెలుసుకోవచ్చు.
అయితే బీహార్ మాధెపురా కు చెందిన ప్రాంజల్ ( Prangle )అనే పదవ తరగతి విద్యార్థి కాలినడకన నడిస్తే కరెంటు ఉత్పత్తి అయ్యే పరికరాన్ని తయారుచేసి, గౌహతి లో ఇటీవలే జరిగిన జాతీయ బాలల సైన్స్ ఎగ్జిబిషన్లో( National Children’s Science Exhibition ) ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు.ఈ డివైజ్ తయారు చేయడం కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాలు పట్టింది.
ఈ డివైజ్ తయారు చేయడం కోసం యూట్యూబ్లో నిరంతరం కావలసిన సమాచారం తెలుసుకొని తయారుచేసినట్లు ఫ్రాంజల్ తెలిపాడు.ఎన్నోసార్లు ప్రయోగం ఫెయిల్ అయినా కూడా పట్టు వదలకుండా ఎట్టకేలకు ఈ డివైజ్ రూపొందించాడు.

ఈ డివైజ్ ను ఇంట్లో వాడిన పనికి రాని పైపు ముక్క, బట్టలు కుట్టేటప్పుడు ఉపయోగించే బెల్టు సహాయంతో తయారుచేశాడు.దీని తయారీకి రూ.1,300 ఖర్చు అయ్యింది.సైన్యం అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుకూర ప్రాంతాల్లో ఉండే సైనికుల కోసం ఈ డివైజ్ రూపొందించానని తెలిపాడు.

ఈ డివైజ్ తో మొబైల్ ఫోన్, వాకి టాకీ వంటి స్మార్ట్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.మారుమూల ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు దాదాపుగా ఉండని క్రమంలో చార్జింగ్ కోసం కష్టాలు తప్పవు.అటువంటి సందర్భంలో ఈ డివైజ్ తో చార్జింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఇక ప్రాంజల్ కు సహాయం చేసిన జూనియర్ సైంటిస్ట్ ఆనంద్ విజయ్ ఈ పరికరాన్ని మరింత మెరుగు గా తయారు చేయవచ్చని చెప్పాడు.
ఈ డివైజ్ కు ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ ఇన్ వాకింగ్ అని పేరు పెట్టినట్లు ప్రాంజల్ తండ్రి సమీర్ దాస్ తెలిపారు.







