మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు.తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనేనంటూ మరోసారి స్పష్టం చేశారు.
ఈ మేరకు కవిత నెంబర్లతో సేవ్ చేసిన స్క్రీన్ షాట్ ను సుకేశ్ చంద్రశేఖర్ రిలీజ్ చేశారు.తనతో జరిపిన చాట్ సంభాషణలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సుకేశ్ డిమాండ్ చేస్తున్నారు.
కోర్టు ధృవీకరణతో ఎవిడెన్స్ చట్టం 65బి కింద తాను స్క్రీన్ షాట్ లను విడుదల చేసినట్లు సుకేశ్ వెల్లడించారు.కవితకు రూ.15 కోట్లు పంపిన తరువాత ఫేస్ టైమ్ లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ లతో మాట్లాడిన స్క్రీన్ చాట్ లను విడుదల చేస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.