వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్..!!

ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని( Balineni Srinivasa Reddy ) పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయడానికి సీఎం మరియు జిల్లా నేతలు( CM jagan ), అధికారులు మార్కాపురం చేరుకున్నారు.

 Ycp Minister Peddireddy Ramachandra Reddy's Serious Comments Ycp, Minister Peddi-TeluguStop.com

ఈ క్రమంలో ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి బాలినేని వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగిందంట.వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని దీంతో బాలినేని అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) స్పందించారు.కావాలని ఒక వర్గం మీడియా వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రజలలో వైసీపీ గ్రాఫ్ తగ్గదని స్పష్టం చేశారు.

వైసీపీలో అసమతి ఉందని తెగ ప్రచారం చేస్తున్నారు.నిజంగా అసమతి ఉంటే దాన్ని తగ్గించే శక్తి కూడా తమ దగ్గర ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube