మే 10వ తారీకు కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.254 స్థానాలకు జరిగే ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం రకరకాల వ్యూహాలతో దూసుకుపోతూ ఉన్నాయి.బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నాయి.మే 10న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు.ఇదిలా ఉంటే కర్ణాటక( Karnataka ) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ ( BJP ) విడుదల చేయడం జరిగింది.మొదటి జాబితాలో 189 మందికి చోటు కల్పించగా ఇందులో 52 మంది కొత్తవారు ఉన్నారు.
కర్ణాటకలో పార్టీ బలపడటానికి రాష్ట్రము అభివృద్ధి చెందటానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని అరిష్టానం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై షిగ్గాన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ పెద్దలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ… దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే రాణిస్తూ ఉంది.దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించే దిశగా బీజేపీ సీనియర్ నాయకులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.