తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గవర్నర్ అనుసరిస్తున్న తీరు రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉందని తెలిపారు.
గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
తమిళిసై చర్యలు, తీరు రాజ్యాంగ వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు.కేంద్రం గవర్నర్లను బీజేపీ ఏజెంట్లుగా వాడుకుంటోందని ఆరోపించారు.
ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం గవర్నర్ పని కాదని స్పష్టం చేశారు.







