పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వారు ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను నిర్మిస్తున్నారు.ఒకవైపు చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
మరి ప్రజెంట్ ఈ సంస్థ చేస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ సినిమా కూడా ఉంది.ఈ రెండు సినిమాలను వీరు తమ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఒకేసారి అప్డేట్ ఇచ్చి మేకర్స్ ఇద్దరి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి.మరి ఈ సంస్థ చేస్తున్న సినిమాల్లో ప్రభాస్ – మారుతి కాంబో ఒకటి అయితే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబో ఒకటి.
ఈ రెండు సినిమాలపై ఇరు ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) ఒక సినిమాకు ( Raja Deluxe ) ఓకే చెప్పాడు.

ఇది కూడా 50 కోట్లతో తక్కువ బడ్జెట్ తో చేస్తున్న కూడా పాన్ ఇండియాలో రేంజ్ లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.ఇప్పటికే మాళవిక ఫిక్స్ అయ్యింది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాపై నిర్మాణ సంస్థ చాలా ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా స్యూర్ షాట్ గా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాతో పాటు వినోదయం సీతం (Vinodhaya Sitham) రీమేక్ కూడా ఈ సంస్థ నిర్మిస్తుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండగా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో పవన్ తన పార్ట్ షూటింగ్ అప్పుడే పూర్తి చేసాడు.
ఇక ఈ సినిమా గురించి వీరు మాట్లాడుతూ.అతి త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేయడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.







