ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి పయనం అయ్యారు.పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయలుదేరారని తెలుస్తోంది.
ఈ మేరకు సుమారు మూడు రోజుల పాటు సోమువీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం.ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది.