ఉపాసన( upasana ) తాజాగా తన శ్రీమంతం వీడియో ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.ఆ వీడియో లో మొత్తం ఉపాసన కుటుంబ సభ్యులు మరియు ఆమె సిస్టర్స్ మాత్రమే ఉన్నారు.
రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని ఫ్యామిలీ నుండి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆ కార్యక్రమం వైభవం గా జరిగిందని ఫోటోలు మరియు వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది.
కానీ ఈ కార్యక్రమం లో మెగా ఫ్యామిలీ కి చెందిన వారు ఎవ్వరూ లేక పోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీసం చిరంజీవి( Chiranjeevi ) మరియు సురేఖ గారు కార్యక్రమం లో లేక పోవడం ఏంటి అంటూ కొందరు ఆగ్రహం తో ఉన్నారు.
అయితే ఈ కార్యక్రమం హైదరాబాదు లో కానీ ఇండియా లో కాని జరగలేదు.విదేశాల్లో జరిగింది.
విదేశాల్లో ఉండే కామినేని ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

అందుకే అక్కడకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హాజరు కాలేదు.దీంట్లో కామెంట్ ఫ్యామిలీ ని కానీ ఉపాసన ను కానీ వ్యతిరేకించడానికి ఏమీ లేదు, తిట్టడానికి ఏమీ లేదు అంటూ మెగా ఫ్యాన్స్ ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శంకర్( Shankar ) దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం వచ్చి సంవత్సరం సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా ను రాంచరణ్ చేయబోతున్నాడు.ఇక సుకుమార్ దర్శకత్వం లో కూడా రాంచరణ్ ఒక సినిమా ను చేసినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.








