తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత( Samantha ) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతుంది.
ఇకపోతే సమంత నటించిన శాకుంతలం ( Shaakuntalam ) సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సమంత ముంబైలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఇలా ముంబై( Mumbai )లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంతా సౌత్ సినిమాల గురించి బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా ఈ రెండు ఇండస్ట్రీల మధ్య ఉన్నటువంటి తేడాలు గురించి ఈమె మాట్లాడుతూ…ఈ రోజుల్లో ఉత్తరాది సినిమాలకు దక్షిణాది సినిమాలకు మధ్య ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవని తెలిపారు.ప్రస్తుతం సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయిందని అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు స్వాగతిస్తున్నారని తెలిపారు.

ఇలా సౌత్ నార్త్ ఇండస్ట్రీల మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని చెబుతూనే తనకు ఈ విషయంలో చర్చలకు తావివ్వడం ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు.నటిగా ఇండస్ట్రీలో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలలో తాను నటిస్తున్నానని ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా ఇతర భాష చిత్రాలను కూడా చూస్తున్నారని ఈ సందర్భంగా సమంత సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీ గురించి తెలియజేశారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శాకుంతలం సినిమాకి గుణశేఖర్ (Gunasekhar)దర్శకత్వం వహించగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ( neelima gunasekhar ) గుణ దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.







