ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.‘ఫ్యామిలీ డాక్టర్ ’ అనే పథకాన్ని సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు.
ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 45,90,086 మందికి ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ యోచిస్తోంది.ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోని క్లినిక్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యామిలీ డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.







