మార్చి 31 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ ( Narendra Modi )స్టేడియం వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ వేడుకలో సౌత్ ముద్దుగుమ్మలు రష్మిక, తమన్నాలు( Rashmika and Tamanna ) డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.సౌత్ ముద్దుగుమ్మలకు నార్త్ లో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.
బాలీవుడ్ లో తమన్నా, రష్మికులకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సౌత్ హీరోయిన్లకు ఐపీఎల్( IPL ) ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ చేసే ఆఫర్లు వచ్చింది.
ఐపీఎల్ లో సందడి చేసిన తొలి సౌత్ స్టార్లు వీరిద్దరే.తమన్నా, రష్మికలు డ్యాన్స్ చేస్తున్నంతసేపు స్టేడియం ఈలలతో, కేకలతో దద్దరిల్లింది.వీరిద్దరూ ఆటపాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అసలు విషయానికి వస్తే ఐపీఎల్ ఆరంభ వేడుకలో డ్యాన్స్ చేసేందుకు రష్మిక రూ.5 కోట్లు, తమన్నా రూ.3 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారంట.రష్మిక సాంప్రదాయ లేహంగాలో, తమన్నా మోడ్రన్ డ్రెస్ లో అభిమానులను అలరించారు.గుజరాత్- చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
చెన్నై జట్టు ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్ 92 పరుగులు చేశాడు.
179 పరుగుల లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి 19.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి బోని ప్రారంభించింది.ఇక మొదటి మ్యాచ్లో పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
మొదటి మ్యాచ్ లోనే ఓడిందని కొందరు అంటే.ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది.
ఇంకా ఆడాల్సింది చాలా ఉంది అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నాయి.ఈరోజు పంజాబ్- కలకత్తా మరియు లక్నో- ఢిల్లీ మధ్య మ్యాచులు జరగనున్నాయి.