బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ( Rani Mukherjee ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.1998 లో కుచ్ కుచ్ హోతా హై సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది.ఆ తరువాత రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రాణి ముఖర్జీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.
కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది.అలాగే ఆమె ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకుంది.ఇప్పటివరకు ఆమె దాదాపుగా 7 ఫిలింఫేర్ అవార్డులను( 7 Filmfare Awards ) సైతం సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణి ముఖర్జీ తన కెరియర్లో ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చింది.రాణి ముఖర్జీ 2014లో బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాని( Aditya Chopra ) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఏడాది తర్వాతే ఓ పాపకు కూడా జన్మనిచ్చారు.
ఆ తర్వాత నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.అయితే ప్రసవ సమయంలో రాణీ ముఖర్జీకి ఎదుర్కొన్న చేదు సంఘటనను తాజాగా ఆమె గుర్తు చేసుకున్నారు.మొదటిసారి బిడ్డను చూసినప్పుడు తన ఫీలింగ్ను ఆమె పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నా కుమార్తె నెలలు నిండకుండానే పుట్టింది.
నిర్ణీత సమయానికి రెండు నెలల ముందే బిడ్డకు జన్మనిచ్చాను.పాప అప్పుడు చాలా సన్నగా ఉంది.
దాంతో నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.ఒక తల్లిగా నాకు చాలా బాధ కలిగింది.
పాపను దాదాపు 7 రోజులు ఐసీయూలో ఉంచారు.దీంతో అక్కడ 15 రోజులు ఉండాల్సి వచ్చింది.
కానీ అదృష్టవశాత్తూ దేవుడి దయ వల్ల నా బిడ్డ క్షేమంగానే తిరిగొచ్చింది.మన జీవితంలో ఒకరిని ఎందుకు అంతగా ప్రేమిస్తామో మొదటిసారి తెలిసొచ్చింది.
ఆ క్షణం నా బిడ్డ కంటే నాకేదీ ముఖ్యం కాదనిపించింది అని తెలిపింది రాణి ముఖర్జీ.తన కుమార్తెకు ఆదిరా అనే పేరు పెట్టారు.
ఆదిరా పుట్టిన తరువాత ఆమె నటనకు గుడ్ బై చెప్పేసింది.