నిజామాబాద్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న యువకుడు బలవన్మరణం చెందాడు.
హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మెడికో మృతిచెందాడని తెలుస్తోంది.మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్ గా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సనత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.