దిశా ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ కేసులో సిర్పుర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా నివేదికపై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాశ్ రెడ్డిని హైకోర్టు నియమించింది.ఈ క్రమంలో గతంలో కమిషన్ నివేదికపై ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ వాదనలలో భాగంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోర్టుకు తెలిపారు.దీనిపై ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.