ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పందించారు.
విమర్శలు చేయటానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమి చేయలేమన్నారు.ఎమ్మెల్యే అన్నా రాంబాబు 28 మందిని తిరుమలకి తీసుకువచ్చారన్న వైవీ సుబ్బారెడ్డి అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదని తెలిపారు.
అయినప్పటికీ వారిలో 18 మందికి ప్రోటోకాల్ కేటాయించారని వెల్లడించారు.వీఐపీలకు నిబంధనల ప్రకారం సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే ఏమి చేయలేమని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.