సాధారణంగా సంవత్సరంలో దాదాపు నాలుగు సార్లు వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, కరోనా వైరస్లు( Infections, Corona Viruses ) లాంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
అటువంటి పరిస్థితులలో ఆహారం విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా దగ్గు( cough ) అతిగా ఉన్నప్పుడు కొన్ని పండ్లకు దూరంగా ఉండడమే మంచిది.
ఎందుకంటే ఈ పండ్లను తిన్నట్లయితే దగ్గులో శ్లేష్మం పెరుగుతుంది.దగ్గులో విషంలా పని చేసే పండ్లు కొన్ని ఉన్నాయి.
ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే దగ్గు, జలుబు అతిగా ఉన్నప్పుడు ఆవకాడోకు దూరంగా ఉండడమే మంచిది.
ఎందుకంటే వాటిలో హిస్టామిన్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి దగ్గును ఇంకా పెంచుతాయి.
అలాగే ఈ పండు శరీరానికి చలువ చేస్తుంది.ఇది తినడం వల్ల కఫం ఇంకా పెరుగుతుంది.
మీకు ఛాతి నొప్పి( Chest pain )కి సంబంధించిన సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.అందువల్ల ఈ పండుకి దూరంగా ఉండటమే మంచిది.
స్ట్రాబెరీ( Strawberry ) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కానీ దగ్గు ఉన్నప్పుడు స్ట్రాబెరీకి దూరంగా ఉండాలి.ఎందుకంటే వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.అందువల్ల దగ్గును ఇది మరింత పెంచుతుంది.దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు సిట్రస్ పండ్లకు దూరంగా ఉండటమే మంచిది.ఇంకా చెప్పాలంటే కొబ్బరి నీరు తాగడం వల్ల దగ్గు సమస్యలో విషం గా పని చేస్తాయి.
ఇది మీ శరీరంలో కఫ మూలాన్ని పెంచుతుంది.జలుబు, దగ్గును తీవ్రం చేస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ద్రాక్ష తినడం వల్ల కఫం, దగ్గు సమస్య ఇంకా పెరుగుతుంది.ద్రాక్ష తినడం వల్ల మీరు నిరంతరం తగ్గు సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.కాబట్టి మీరు దగ్గుతో బాధపడుతున్నట్లయితే కొన్ని రోజులు ద్రాక్ష తినకపోవడమే మంచిది.అలాగే ఈ పండ్లకు బదులుగా దగ్గు, జలుబును తగ్గించడంలో మీకు సహాయపడే ఈ వేడి పదార్థాలను తినడం ఎంతో మంచిది.