తెలంగాణలో క్రికెట్ ఆడుతూ చనిపోయిన యువకుడు..!!

గుండెపోటు( Heart attack ) మరణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.వయస్సుతో సంబంధం లేకుండా ఊహించని విధంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి.

 Telangana Youth Died While Playing Cricket Due To Heart Attack Details, Telanga-TeluguStop.com

అసలు చాలా చలాకిగా ఉండే మనుషులు సైతం నడుస్తూ నడుస్తూనే చనిపోతున్నారు.కొంతమంది స్టేజిపై డ్యాన్స్ చేస్తూ మరి కొంతమంది.

జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగానే తుది శ్వాస విడుస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా గుండెపోటు మరణాలు ఇటీవల సంభవిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా జగిత్యాల జిల్లాలో ( Jagital ) 34 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు గుండెపోటుతో మరణించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లికి చెందిన కొంపెల్లి రాజవిష్ణు సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.వెంటనే క్రికెట్ ఆడుతున్న వాళ్లు స్నేహితులంతా కలిసి.రాజవిష్ణునీ దగ్గరలో ఉన్న మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలియజేశారు.

విష్ణుకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కూడా ఉన్నారు.వాళ్లది చిన్న వయసు కావటంతో… భార్యతో పాటు బిడ్డలు కన్నీరు మున్నీరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube