సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఇటీవలే సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి అదే జోష్ లో పూర్తి చేస్తున్నాడు.
మహేష్, త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం మహేష్ అండ్ టీమ్ రాత్రి పగలు కష్ట పడుతున్నాడు.అందుకే షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేసారు.దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఆగస్టులో వస్తారని ఫిక్స్ అయ్యారు.దీంతో ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు.కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో సరికొత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని టాక్.
అయితే మేకర్స్ ముందుగా ఈ సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా వచ్చే ఏడాదికి వెళ్లిపోవచ్చని టాక్ వస్తుంది.దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అంత ఎగ్జైట్మెంట్ పెట్టుకోవడం మంచిది కాదని కొంతకాలం ఆ ఎగ్జైట్మెంట్ ను హోల్డ్ లో పెట్టుకుంటే మంచిది అని అంటున్నారు.