ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించడంతో నేరేడుచర్ల పట్టణంలో టి.టీడీపీ శ్రేణులు శనివారం ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి,స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ధర్మం,న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.తెలంగాణలో కూడా టీడీపీ పూర్వవైభవం సంతరించుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్వాయి రమేష్, పొనుగోటి జంగారావు, ఇంజమూరి వెంకటయ్య, సామ సైదులు,చందమళ్ళ వెంకన్న,ఎనుగంటి పుల్లయ్య చౌదరి, చెరుకూరు మాల్యాద్రి, జింకల పిచ్చయ్య నాయుడు,యాళ్ల దశరధ, చెరుకుమల్లి కిశోర్, నిమ్మగడ్డ సుబ్బారావు, కామళ్ళ అంజి,శివనేని శ్రీరాములు,బొల్లెద్దు నాగేష్,సంకలమద్ది భిక్ష్మారెడ్ఢి,సామ నాగరాజు, బూషి గొవర్ధన్,చింతల ఈశ్వర్,అల్లు నాగభూషణం, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.