తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈనెల 27న విచారణ జరగనుంది.ముఖ్య బిల్లులను ఆరు నెలలుగా పెండింగ్ లో పెట్టారని, వాటిని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్పై త్వరగా విచారణ చేపట్టాలని సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే సుప్రీంకోర్టును కోరారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 27న విచారణ చేస్తామని వెల్లడించింది.







