రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ ని కలిసిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజభవన్ లో ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను(Abdul Nazeer,) మొట్టమొదటిసారి కలిశారు.దాదాపు గంటపాటు ఆయనతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది.

 Pawan Kalyan Met Ap Governor At Raj Bhavan Ap Governor Abdul Nazeer, Janasena Fo-TeluguStop.com

ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా దాంట్లో మనోహర్ కూడా ఉన్నారు.రాష్ట్రంలో తాజా పరిస్థితులు .పరిణామాలపై గవర్నర్ తో పవన్ చర్చించడం జరిగింది.ఇదిలా ఉంటే రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిపించడానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది.మాత్రమే సమయం ఉండటంతో ఈ సభలో జనసేన కార్యాచరణ పవన్(Pawan Kalyan,) ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.బీసీ సదస్సులో అదే విధంగా కాపులతో సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో జనసేన పార్టీ(Janasena) వచ్చే ఎన్నికలకు పొత్తులతో ముందుకు వెళ్తుందా లేదా ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది రేపు క్లారిటీ రానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube