తిరుపతి జిల్లా కుమ్మరితోపు పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందన్న సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.
పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.
అదికాస్తా ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి.ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.