పోడు భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
అనంతరం తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.