ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ రసవత్తరంగా కొనసాగుతున్నాయి.సత్తుపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటికి డబుల్ షాక్ తగిలింది.
మట్టా దయానంద్, పిడమర్తి రవిలు పొంగులేటికి దూరమైయ్యారని తెలుస్తోంది.పార్టీ మారే విషయంలో పొంగులేటితో విభేదాలు వచ్చినట్లు సమాచారం.
సొంత నియోజకవర్గంలో పొంగులేటికి ఎదురు గాలి వీస్తోంది.మట్టా దయానంద్ తీరుతో తలనొప్పులు వస్తున్న క్రమంలో అభ్యర్థి విషయంలో పొంగులేటికి మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.







