కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.దేశంలో గత ఎనిమిదేళ్లుగా అయితే జుమ్లా లేకుంటే హమ్లా అన్నట్లుగా మోదీ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు.
కావాలనే బీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు.
మోదీ సమన్లు అని విమర్శలు గుప్పించారు.అదానీకి ఆరు ఎయిర్ పోర్టులు రాసివ్వడం స్కామ్ అన్న కేటీఆర్ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేయడం కూడా స్కామేనని ఆరోపించారు.







