తెలంగాణలో గుండెపోటుతో ఒకేరోజు ఐదుగురు మృతి..!!

దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా నమోదవుతున్నాయి.ఏకంగా స్కూల్ మరియు కాలేజీలు చదువుతున్న విద్యార్థులు సైతం గుండెపోటుకు గురై మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 Five People Died In One Day Due To Heart Attack In Telangana Details, Heart Att-TeluguStop.com

ఒకప్పుడు పెద్ద వయసు కలిగిన వారు గుండెపోటుకు గురై ఎక్కువుగా మరణించేవారు.కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి.

స్కూల్లో విద్యార్థులు నడుస్తూ నడుస్తూనే చనిపోతున్నారు.

సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.గత రెండు సంవత్సరాల నుండి గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే గుండెపోటుతో ఐదుగురు మరణించారు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి రాకేష్(18),

సిద్దిపేట జిల్లా కడవేర్గు గ్రామానికి చెందిన శ్రీనివాస్ (36), నిర్మల్ జిల్లా కుంటాలలోని ఓ పాఠశాల హెచ్ఎం లాలన్న(50), కామారెడ్డి జిల్లా జనకంపల్లి ఖుర్ధు గ్రామంలో ఓ ఆయా(54), ఎల్లారెడ్డిలో అహ్మద్ (36) అనే వ్యక్తులు గుండెపోటుతో మరణించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube