ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ సమావేశాల నిర్వహాణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సమావేశాలలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.అయితే ఇటీవల మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంతో కైలాశ్ గెహ్లాట్ ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.







