కంటి సైగతో ఆ యాంకర్ కు చుక్కలు చూపించిన కేటీఆర్.. ఏం జరిగిందంటే?

తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కేటీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

 Telugu Anchor Warned By Ktr Details Here Goes Viral In Social Media , Comedian-TeluguStop.com

నిన్న బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరగగా మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రముఖ కమెడియన్ వేణు ఈ సినిమాకు దర్శకుడు కాగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.స్టేజ్ పైకి జాతిరత్నాలు దర్శకుడు కేవీ అనుదీప్ ను యాంకర్ పిలవగా అదే సమయంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ స్టేజ్ పైకి ఎంటర్ అయ్యారు.

అనుదీప్ మాట్లాడుతున్న సమయంలో యాంకర్ ఆపేసి సిద్ధు జొన్నలగడ్డకు స్వాగతం పలికారు.

ఇది గమనించిన కేటీఆర్ వెంటనే కంటిచూపుతో అనుదీప్ కు మైక్ ఇవ్వాలని అర్థం వచ్చే విధంగా సైగలు చేశారు.ఆ సమయంలో యాంకర్ ఫేస్ ఒక్కసారిగా మారిపోగా యాంకర్ అనుదీప్ కు మైక్ ఇచ్చేసి వెళ్లిపోయారు.ఈ నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించి మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బలగం సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కగా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.బలగం మూవీకి పరవాలేదనే స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే వేణు దర్శకుడిగా బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube