తెలంగాణలో భారీ నిరసనలు చేపట్టాలని బీజేపీ యోచిస్టున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది.అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాల్లో పది భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది.
ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ భేటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.







