తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.ఆయన కూడా ఇప్పటి వరకు ఈమె కు స్టార్ హీరో లతో యంగ్ హీరో లతో నటించే అవకాశాలు వరుసగా రాక పోవడం విడ్డూరంగా ఉంది.
మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా లో నటించిన కూడా కీర్తి సురేష్ ని ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.సినిమా ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ అవ్వడం వల్ల కీర్తి సురేష్ యొక్క కెరియర్ ఆరంభం లో ఫుల్ జోష్ గా సాగింది.
కానీ ఇప్పుడు మాత్రం అలా లేదనే చెప్పాలి.

హీరోయిన్ గా ప్రస్తుతం దసరా సినిమా కోసం వెయిట్ చేసిన కీర్తి సురేష్ వెంటనే కొత్త సినిమా లకు కమిట్ అవ్వాలని ఆశ పడుతుంది.కానీ కీర్తి సురేష్ యొక్క కొత్త సినిమాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.కెరీర్ ప్రారంభం లో ఆమె ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ విషయం లో తప్పు జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కీర్తి సురేష్ యొక్క అందాల ఆరబోత కు జనాలు ఆసక్తి చేయించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.
మొత్తానికి కీర్తి సురేష్ యొక్క కెరియర్ అత్యంత దారుణంగా ఉందని స్వయం గా ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి నుండి అయినా స్క్రిప్ట్ విషయం లో కీర్తి సురేష్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కీర్తి సురేష్ యొక్క కెరీర్ మళ్లీ గాడిలో పడాలి అంటే కచ్చితంగా రెండు మూడు సూపర్ హిట్స్ అయినా పడాల్సిందే.







