ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.కన్ఫర్మ్ టికెట్ కోసం ‘ఐఆర్ సీటీసీ వికల్ప్ స్కీం’ ను అందుబాటులోకి తీసుకురానుంది.
సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్ కన్ఫర్మ్ కానివాళ్లను వెయిటింగ్ లిస్టులో చేర్చుతారు.ఈ క్రమంలోనే ఎవరైనా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే… వరుస క్రమాన్ని అనుసరించి సీటును కేటాయిస్తుంటారు అధికారులు.
ఇలాంటివి అన్ని సమయాల్లో జరగవు.ఈ క్రమంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకురానున్నారు.
ఐఆర్ సీటీసీ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ స్కీం అందుబాటులో ఉంటుంది.ఇకపై వెయిటింగ్ లిస్ట్ అని నిరాశ చెందాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ తెలిపింది.







