ఉద్ధవ్ థాక్రే వర్గం పిటిషన్‎పై సుప్రీంలో విచారణ వాయిదా

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గం, షిండే వర్గానికి మధ్య గత కొన్ని రోజులుగా వార్ కొనసాగుతోంది.శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ షిండే వర్గానికి కేటాయించినట్లు ప్రకటించింది.

 Supreme Court Postpones Hearing On Uddhav Thackeray Faction's Petition-TeluguStop.com

అయితే దీన్ని తప్పుబట్టిన థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.

కాగా ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.మరోవైపు శివసేన పేరు, గుర్తు కేటాయింపులో ఈసీ అమ్ముడుపోయిందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఈ వాదనను షిండే వర్గం ఖండించింది.అయితే పార్టీ పేరు, గుర్తుపై వివాదం సుప్రీంకు చేరడంతో ధర్మాసనం తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube