బాహుబలి సూపర్ హిట్ అయింది, ఆ సినిమా యొక్క సీక్వెల్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.కేజిఎఫ్ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఆ సినిమా యొక్క సీక్వెల్ రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.ఇంకా కొన్ని సినిమాలు మొదటి పార్ట్ సక్సెస్ అవ్వగా రెండవ పార్ట్ భారీ విజయాలను నమోదు చేయడం జరిగింది.
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాలు ఎక్కువ శాతం సీక్వెల్ అనే విషయం తెలిసిందే.
అందుకే పుష్ప యొక్క రెండవ భాగం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.రూ.1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా దర్శకుడు సుకుమార్ పుష్ప యొక్క సీక్వెల్ రూపొందిస్తున్నాడని సమాచారం అందుతుంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

సీక్వెల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి పుష్ప రెండవ భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం, కానీ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోతే మాత్రం పుష్ప పరిస్థితి ఏంటి అంటూ అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప రెండో భాగం రూపొందుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా పై నమ్మకం తో భారీగా ఖర్చు చేస్తున్నారు.అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.మరి సినిమా ఆ స్థాయిలో సినిమా ఉంటుందా అనేది చూడాలి.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్.సునీల్.అనసూయ నటిస్తున్నారు.బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటం సాంగ్ ను చేయబోతుంది.







