తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో షూట్ జరుపుకుంటున్న క్రేజీ సినిమాలలో ఒకటి అనే సంగతి తెలిసిందే.మైత్రీ నిర్మాతలు, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూట్ మొదలుకానుండగా 2024 చివర్లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
2024 సంవత్సరం ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని తెలుస్తోంది.తారక్ ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ ను మామూలుగా షేక్ చేయరని ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువగానే ఉంటాయని సమాచారం.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని వినిపిస్తుండగా అటు ప్రశాంత్ నీల్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ ఇందుకు సంబంధించి స్పందించడం లేదు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

తారక్ అభిమానుల ఆశలన్నీ ఈ దర్శకునిపైనే ఉన్నాయి.తారక్ ఈ సినిమాలో బొద్దుగానే కనిపించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మినహా ఎలాంటి అప్ డేట్ రాలేదు.షూటింగ్ కు చాలా సమయం ఉండటంతో ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని మేకర్స్ అస్సలు భావించడం లేదు.
తారక్ పుట్టినరోజు కానుకగా ఏదైనా మూవీ అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కు బ్రహ్మాండమైన బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.ఈ సినిమాతో తారక్ కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్ చేరడం గ్యారంటీ అని తెలుస్తోంది.తారక్ సినిమాలు అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ లో ఒకింత అసంతృప్తి ఉంది.
తారక్ ప్రశాంత్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.







