ఏపీ మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్ కూడా ఓ పౌరుడేనన్నారు.

మంచి ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం వాలంటీర్లకు వచ్చిందని పేర్కొన్నారు.ఓ మంచి కార్యక్రమం కోసం చెప్పే హక్కు ఉందని తెలిపారు.

వాలంటీర్లు ప్రతిపక్షాలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.ఓటర్లను మంచి డైరెక్షన్ లో తీసుకు వెళ్లాలని సూచించారు.

చంద్రబాబు వస్తే ముందు తుపాకీ పేలేది వాలంటీర్లపైనేనని వెల్లడించారు.ఈ క్రమంలో ఆయన పేల్చే వరకు ఎందుకన్న మంత్రి ధర్మాన మనమే పేల్చేద్దామంటూ వ్యాఖ్యనించారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు