తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళ సినిమాలు హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో వాళ్ళతో చేసే పాత్రలని కూడా చాలా సెలెక్టివ్ గా తీసుకుంటారు అయితే మెగాస్టార్ మేనల్లుడు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా అయిన రేయ్ సినిమా రిలీజ్ లేట్ అవ్వడం తో దిల్ రాజు గీత ఆర్ట్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాయి
అందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్ హీరోగా రెజీనా హీరోయిన్ గా ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన సినిమా పిల్లా నువ్వూ లేని జీవితం… ఈ సినిమానే సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా గా రిలీజ్ అయింది ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు…అయితే ఈ సినిమాలో జగపతి బాబు పోషించిన క్యారెక్టర్ ఆయన కంటే ముందే శ్రీహరిని పెట్టీ చాలా భాగం షూట్ చేశారు.
అలా షూట్ చేసిన తర్వాత కొద్ది భాగం షూట్ అయిపోయాక ఆయన చనిపోయారు దాంతో ఏం చేయాలో తెలియక చాలా ఆలోచించిన తర్వాత జగపతిబాబు అయితేనే ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలడు అని మువీ టీమ్ అనుకొని జగపతి బాబు తో ఆ పాత్ర చేయించారు అలా ఆ పాత్ర లోకి జగపతి బాబు వచ్చారు ఆయన కూడా చాలా బాగా చేసి ఈ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించారు…
ప్రస్తుతం జగపతిబాబు కీలకమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో చాలా బిజీ ఆర్టిస్టు గా మారిపోయారు.తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు సంపాదించుకుంటున్నారు…
.