ప్రముఖ నటి దివ్యవాణి ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి, ఆస్తుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.గాసిప్స్ ను నేను పట్టించుకోనని ఆమె తెలిపారు.
నేను కోవర్టునని డబ్బులు తీసుకున్నానని చాలామంది గతంలో ట్రోల్స్ చేశారని దివ్యవాణి అన్నారు.మనం ఏంటో మనకు తెలుసని ఆమె అన్నారు.
నేను ఫోన్ వాడనని వాట్సాప్ ను కూడా మా పిల్లలు నేర్పించారని దివ్యవాణి తెలిపారు.
నేను సింపుల్ లైఫ్ ఇష్టపడతానని ఆమె కామెంట్లు చేశారు.
మనం కొన్ని పనులు చేయాలంటే కొంత పవర్ కావాలని ఆ పవర్ కావాలంటే దేవుడి అనుగ్రహం ఉండాలని దివ్యవాణి అన్నారు.నాన్న చనిపోయిన సమయంలో చాలా బాధ పడ్డానని అంత బాధ పడ్డ ఘటన మరొకటి లేదని ఆమె కామెంట్లు చేశారు.
దేవుడు ఏదో ఒక బాధను పెడతాడని దివ్యవాణి వెల్లడించారు.మా బాబు ఎప్పుడైనా ఎదురుతిరిగితే అప్పుడు బాధ వేస్తుందని ఆమె పేర్కొన్నారు.

పిల్లలు మనం చెప్పింది అర్థం చేసుకోకపోతే బాగా బాధ కలుగుతుందని దివ్యవాణి చెప్పుకొచ్చారు.నా జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే పిల్లలు అని దివ్యవాణి చెప్పుకొచ్చారు.మన ముందు వెనుక ఏముందో మనకు తెలియదని ఆమె కామెంట్లు చేశారు.పొలిటికల్ లైఫ్ లో వివాదాలకు పోనని ఉన్నది ఉన్నట్టుగా నేను చెబుతానని దివ్యవాణి తెలిపారు.

నేను టీడీపీ నేతలను తిడితే వాళ్లు నాకు కాల్ చేసి ఎందుకు తిట్టారని బాధ పడ్డారని ఆమె కామెంట్లు చేశారు.ప్రముఖ కాఫీ ఎస్టేట్ ఓనర్ ను నేను పెళ్లి చేసుకున్నానని దివ్యవాణి అన్నారు.నాకు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆమె తెలిపారు.ఎంతమందిని మనం కంట్రోల్ చేయగలమని దివ్యవాణి తెలిపారు.







