యజ్ఞం సినిమాకి మొదటి హీరో ఎవరో తెలుసా..?

మొదట గోపిచంద్ హీరోగా ఇండస్ట్రీ కి వచ్చి తొలి వలపు అనే సినిమా చేసాడు ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కొద్దీ రోజులు ఆఫర్స్ ఏం లేక ఖాళీ గా ఉన్నాడు.

దాంతో తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు దాంతో వరుసగా నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ గా నటించి విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు.

మళ్లీ హీరోగా చేయాలి అనుకుంటున్నా టైం లో నిర్మాత పోకిరి బాబురావు గారు వచ్చి యజ్ఞం సినిమా కథ చెప్పడం తో ఆ కథ బాగా నచ్చి ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపి చంద్.ఆ సినిమా కి కె ఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్షన్ చేసాడు ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది దాంతో గోపి చంద్ హీరోగా తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోయాడు.

అయితే ఇది ఇలా ఉంటె ఈ సినిమా స్టోరీ ని ముందుగా పోకిరి బాబు రావు గారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చెప్పడం తో కథ ప్రభాస్ కి బాగా నచ్చింది కానీ ఈ సినిమాకి డైరెక్టర్ గా వి వి వినాయక్ చేస్తే నేను ఈ సినిమా చేస్తాను అని చెప్పాడట దాంతో పోకిరి బాబురావు గారు గోపి చంద్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ సినిమా కనకప్రభాస్ కి పడితే ఛత్రపతి కంటే ముందే ప్రభాస్ ఒక అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో రచ్చ చేసేవాడు ఆయన క్రేజ్ ఇంకా పెరిగిపోయి ఉండేది గోపి చంద్ కెరియర్ అప్పుడే హీరోగా మొదలవ్వడంతో ఈ సినిమా భారీ హిట్ అయినప్పటికీ దానికి తగ్గ కలెక్షన్స్ రాలేదు అదే ప్రభాస్ మార్కెట్ అప్పటికి చాలా ఎక్కువగా ఉండటం తో ప్రభాస్ చేసి ఉంటె ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి.

ప్రభాస్ ఖాతాలో పడాల్సిన భారీ హిట్ మిస్ అవ్వడం అనేది ఆయన ఫ్యాన్స్ ఎప్పటికి జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.అలాగే గోపి చంద్ కూడా మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లో ఉన్నాడనే అనే చెప్పాలి.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు