సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ”SSMB28”.ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కానుంది.
ఇప్పటికే అతడు, ఖలేజా వంటి రెండు డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మరో కొత్త జోనర్ లో మహేష్ ను సరికొత్తగా చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇక సర్కారు వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను చాలా గ్యాప్ తీసుకుని స్టార్ట్ చేసాడు.
మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా వాయిదా పడుతూ వస్తుంది.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మరి ప్రెజెంట్ అయితే ఫుల్ స్వింగ్ లో యాక్షన్ సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది.ఇంత బిజీగా షూటింగ్ జరుగుతున్నా కూడా కొద్దిగా దొరికిన ఖాళీ సమయంలో త్రివిక్రమ్ తన టీమ్ సభ్యులతో క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.సైలెంట్ గా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఇలా క్రికెట్ ఆడుతున్న వీడియో బయటకు రాగా ఇది కాస్త ట్రేండింగ్ అవుతుంది.
మొత్తానికి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ఇలా వీడియో బయటకు రావడంతో షూటింగ్ జరుగుతుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారని సమాచారం.ఇక ఈ సినిమా షూట్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వకుండా ఆగస్టుకు వాయిదా వేశారు.