యువ హీరో శర్వానంద్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాడు.శర్వానంద్ రీసెంట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా టాక్ బాగున్నా సరే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదు.
ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడుతున్న శర్వానంద్ ఇద్దరు దర్శకులకు ఓకే చెప్పినట్టు టాక్.అందులో ఒకరు కృష్ణ చైతన్య కాగా మరొకరు శ్రీరాం ఆదిత్య అని తెలుస్తుంది.
కృష్ణ చైతన్యతో ప్రాజెక్ట్ కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉంది.
కొత్తగా శ్రీరాం ఆదిత్య కూడా శర్వానంద్ కు ఒక కథ చెప్పగా అది నచ్చిన శర్వానంద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
శర్వానంద్ నెక్స్ట్ రెండు సినిమాలకు డైరెక్టర్స్ ఫిక్స్ అయ్యారు.త్వరలోనే ఈ సినిమాల అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.మరి ఈ రెండు సినిమాలైనా సరే శర్వానంద్ కి హిట్ జోష్ ఇస్తాయో లేదో చూడాలి.రీసెంట్ గా రక్షితా రెడ్డితో శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.
మరి రక్షితా తన జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది కాబట్టి లక్ కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.