తారకరత్నకు మరోసారి అన్ని వైద్య పరీక్షలు..

బెంగళూరులోని నారాయణ హృదలయాల ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది.తారకరత్నకు 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది.

దీంతో మరోసారి అన్ని పరీక్షలు రిపీట్ చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో నారాయణ హృదలయాలకు నిమ్ హాన్స్ వైద్యులు చేరుకున్నారు.

కాగా ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు.బ్రెయిన్ డెడ్ రికవరీపై దృష్టి సారించారు వైద్యులు.

అయితే తారకరత్న చికిత్సకు ఇవాళ నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి.మరోవైపు తారకరత్న వైద్య సేవలను కర్ణాటక మంత్రి సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

అదేవిధంగా బాలకృష్ణతో పాటు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కుమార్తె ఆస్పత్రిలోనే ఉన్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు