ఐసీయూలో తారకరత్న.. పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం

బెంగళూరులోని నారాయణ హృదలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు ఎక్మో చికిత్స కొనసాగుతోంది.నిన్న పాదయాత్రలో గుండెపోటుకు గురైన ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం తారకరత్నకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అయితే తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిన నేపథ్యంలో రక్తస్రావం తీవ్రంగా అవుతున్నట్లు తెలుస్తోంది.బీపీ లెవల్స్ అధికంగా ఉండటంతో తారకరత్నకు బ్లీడింగ్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

దీంతో బ్లీడింగ్ ను నియంత్రించడానికి వైద్యుల బృందం ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు