యువగళం పేరు వినగానే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.పాదయాత్ర నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరైయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.ఒక్క అవకాశమని జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న లోకేశ్… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడే అవకాశాన్ని యువకులకు కల్పిస్తున్నామని వెల్లడించారు.